సత్యవేడు ఎమ్మెల్యే కేసులో బిగ్ ట్విస్ట్.. కేసును వాపస్ తీసుకున్న బాధితురాలు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది.

Update: 2024-09-21 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై వేసిన లైంగిక ఆరోపణల కేసు‌ను క్వాష్‌ చేయాలని శుక్రవారం.. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ఇరు పక్షాలు కాంప్రమైజ్‌ కావడంతో పిటిషన్‌‌ను హైకోర్టు డిస్పోజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు వేసిన మహిళ.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు అవాస్తవమని అఫిడవిట్‌ అందడంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా గత వారం టీడీపీ‌కి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, టీడీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.


Similar News