Ap News: సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు.. రూ. 25 లక్షల చెక్ అందజేత
ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు మోహన్ బాబు ఆయన తనయుడు విష్ణు కలిశారు....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu)ను సినీ నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu), ఆయన తనయుడు విష్ణు (Vishnu) కలిశారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్కు శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు (Srividyanikethan Educational Trust) నుంచి రూ. 25 లక్షల చెక్ను అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల ఏపీ(Ap)లో కురిసిన వర్షం(Rains)తో పలుచోట్ల భారీ వరదలు (Floods) వచ్చాయి. ఈ వరదల్లో చాలా మంది బాధితులు నిరాశ్రయులుగా మారిపోయారు. వరదల్లో గూడు, గుడ్డ అన్ని కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ఆదుకునేందుకు చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజలు ముందుకు వచ్చారు. వారికి తోచినంత ఆర్థిక సాయం అందజేశారు. ఇలా దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును మంచు ఫ్యామిలీ కలిసి రూ. 25 లక్షల చెక్ను అందజేసింది.