Kalyandurgam: ‘జగన్ పాలనకు ముగింపు పలుకుదాం’ అంటూ టీడీపీ పాదయాత్ర

రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనకు ముగింపు పలుకుదామని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు...

Update: 2023-10-28 13:33 GMT

దిశ, కళ్యాణదుర్గం: రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనకు ముగింపు పలుకుదామని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు. కంబదూరు మండలం మర్రి మాకులపల్లి నుంచి ములకనూరు వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు ఇక మనం ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అనంతరం తిమ్మప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Tags:    

Similar News