మన్యం జిల్లాలో దారుణం.. రైతును వెంటాడి చంపిన ఏనుగులు

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది..

Update: 2024-10-24 15:36 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ఏనుగులు(Elephants) వెంటాడి చంపాయి. అటవీప్రాంతం(forest area)లో నుంచి పెదబొండపల్లి(Pedabondapalli) పొలాల సమీపంలోకి వచ్చాయి. పొలంలో ఉన్న రైతు యాకోబ్‌ను చూసిన ఏనుగులు పెద్దగా శబ్ధాలు చేస్తూ ఆయన వైపు వెళ్లాయి. దీంతో యాకోబ్‌ అక్కడి నుంచే వెళ్లిపోయే ప్రయత్నం చేశారు, కానీ రైతుపై దాడి చేసి చంపాయి. అనంతరం పెదబొండపల్లిలోకి వెళ్లాయి. గ్రామస్తులను ఏనుగులు వెంబడించాయి. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. చివరకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.

అయితే తరచూ ఏనుగులు తమ ప్రాంతంలోకి వస్తున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. ఏనుగుల దాడల్లో గతంలోనూ పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులు ఎప్పుడు ఏం చేస్తాయోనని భయాందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏనుగులు తమ పొలాలు, గ్రామాలవైపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన యాకోబ్ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 


Similar News