Ys Viveka Case: వైఎస్ సునీత పిటిషన్.. సుప్రీంకోర్టులో విచారణ

వివేకా హత్య కేసులో వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..

Update: 2024-07-22 09:22 GMT

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. కేసు సిట్ నుంచి సీబీఐ విచారణ వరకూ వెళ్లింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇదే కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి సైతం  అరెస్ట్ అయి బెయిల్‌‌పై విడుదల అయ్యారు. అయితే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని వివేకాందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. సెప్టెంబర్ రెండో వారంలో విచారణ  చేపట్టనున్నట్లు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకు సూచించింది. 

Tags:    

Similar News