జాతీయ రహదారిపై సిమెంట్ లారీ దగ్ధం

చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 పై ప్రమాదవశాత్తు సిమెంటు లారీ దగ్ధమైంది.

Update: 2024-10-11 11:31 GMT

దిశ,చిట్యాల: చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 పై ప్రమాదవశాత్తు సిమెంటు లారీ దగ్ధమైంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి..ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి హైదరాబాదుకు సిమెంటును తీసుకు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ.. చిట్యాల శివారుకు రాగానే ప్రమాదవశాత్తు లారీ ముందు టైరు పంచర్ అయ్యింది. దీంతో లారీ బ్యాలెన్స్ తప్పి ముందు ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ఒక్కసారిగా నిప్పు రావడంతో.. పెట్రోల్ ట్యాంకు కు మంటలు అంటుకున్నాయి. లారీ మొత్తం దగ్ధమైంది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే లారీలో నుంచి బయటికి పరుగులు తీసాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం నుంచి 11 గంటల వరకు సుమారు నాలుగు గంటల పాటు వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు.


Similar News