Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న బొలెరో ఒకరు మృతి

బాలనగర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఓ బొలెరో వాహనం డ్రైవర్ వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-09-04 04:07 GMT

దిశ, బాలనగర్:బాలనగర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఓ బొలెరో వాహనం డ్రైవర్ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతిదొడ్డి గ్రామానికి చెందిన శివయ్య (32) (ఏపీ 39VE 4878) గల బొలెరో వాహనంలో టమాటాలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. బుధవారం తెల్లవారుజామున బాలానగర్ మండల కేంద్రంలో ముందుకు కదులుతూ.. ప్రయాణిస్తున్న లారీని.. శివయ్య వేగంగా ఢీకొట్టాడు. దీంతో శివయ్య బొలెరో వాహనంలో తీవ్ర గాయాలతో చిక్కుకుపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని..శివయ్యను బయటకు తీశారు. 108 సిబ్బంది పరీక్షించగా.. శివయ్య అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News