తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు

గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉదయం ఎండగా ఉండి సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-10-06 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉదయం ఎండగా ఉండి సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వరద నీరు రోడ్లపై చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అలాగే వరదల వల్ల కుంటలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బాగా ఇక్కట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఒక్కసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కాగా హైద్రాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 


Similar News