Committee Kurrollu: బ్లాక్ బస్టర్ హిట్ ‘కమిటీ కుర్రోళ్ళు’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు.. అధికారిక ప్రకటన విడుదల

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’.

Update: 2024-09-06 06:56 GMT

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ చిత్రం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి శ్రీరాధా స్టూడియోస్ బ్యానర్స్‌పై యదు వంశీ తెరకెక్కించాడు. ఇందులో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించి మెప్పించారు. చిన్న సినిమాగా వచ్చిన కమటీ కుర్రోళ్ళు ఆగస్టు 9న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సమయంలోనే 10 చిత్రాలు విడుదలైనప్పటికీ ఈ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో కమిటీ కుర్రోళ్ళు బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

అయితే కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టిన ఈ మూవీ అంచనాలను మించిన రెస్పాన్స్‌ను దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దీని ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘‘జాతర చూడటానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసి ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 


Similar News