ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్

ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-05-14 20:01 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోవడంతో ఆ జట్టు‌కు మార్గం సుగమమైంది. రాజస్తాన్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. లక్నో ఈ మ్యాచ్‌‌లో నెగ్గి.. ఆఖరి మ్యాచ్‌లో ముంబైని కూడా ఓడిస్తే 16 పాయింట్లు సాధించేది. కానీ, ఢిల్లీ చేతిలో ఓడటంతో ఆ జట్టు ముంబైపై గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లు పొందే అవకాశం మాత్రమే ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న చెన్నయ్, హైదరాబాద్ మినహా మిగతా జట్లకు 16 పాయింట్లు పొందే చాన్స్ లేదు. దీంతో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు నాకౌట్ బెర్త్ ఖాయమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రెండో జట్టు రాజస్థాన్. ఆ జట్టుకు మిగతా రెండు మ్యాచ్‌లు ఇక నామమాత్రమే. నేడు పంజాబ్‌తో, ఈ నెల 19న కోల్‌కతా రాజస్థాన్ తలపడనుంది. 

Tags:    

Similar News