ఘోర యాక్సిడెంట్..వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-18 14:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ ఫుటేజీ పోలీసులకు చెక్ చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. ఇటీవల బిసెంట్ నగర్‌లో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీ సాయంతో విచారణ చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు నిర్ధారించి మాధురి పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెకు బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.


Similar News