మహిళ దారుణ హత్య..8 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది.

Update: 2024-09-06 08:15 GMT

దిశ,నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతమంది యువకులు మద్యం సేవించి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు యువకులను విచారిస్తున్నారు.


Similar News