ప్రాణం తీసిన క్షణికావేశం.. తండ్రి మందలించాడని..

మహమ్మదాబాద్ మండల పరిధిలోని దేశాయిపల్లి గ్రామానికి

Update: 2024-09-11 14:50 GMT

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల పరిధిలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన దొంగల చంద్రకళ, కృష్ణయ్య దంపతుల కూతురు దొంగల శ్రీలత (14). ఆమె నంచర్ల లో పదో తరగతి చదువుతుంది. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా తోటి విద్యార్థులకు తన తల్లి ఇచ్చిన రూ.200 లతో తరగతి విద్యార్థులకు చాక్లెట్లు పంచింది. తన తండ్రి దొంగల కృష్ణయ్య చాక్లెట్లు పంచడానికి డబ్బులు ఎక్కడివని మందలించగా శ్రీలత క్షణికావేశంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఇంట్లో పడి అక్కడే వాంతులు చేసుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకపోవడం జరిగింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9:30 గంటలకు మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Similar News