లారీ పై నుండి జారిపడి క్లీనర్ మృతి

ప్రమాదశాత్తు ‌ లారీపై నుండి జారిపడి క్లీనర్ జటోత్ నెహ్రూ మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద బైపాస్ లో చోటు చేసుకుంది.

Update: 2024-09-11 16:25 GMT

దిశ, హుజూర్ నగర్ : ప్రమాదశాత్తు ‌ లారీపై నుండి జారిపడి క్లీనర్ జటోత్ నెహ్రూ మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద బైపాస్ లో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్ )మండలం దుబ్బ తండాకు చెందిన జాటోత్ నెహ్రు (37) తన తమ్ముడైన జాటోత్ శరత్ బాబు నడుపుతున్న లారీ పై 20 రోజుల నుండి క్లీనర్ గా వెళ్తున్నాడు.

    మంగళవారం రాత్రి సిమెంట్ లోడు నిమిత్తం హైదరాబాద్​ నుండి మేళ్లచెరువు లోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కి వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట కాలనీలోని బైపాస్ వద్దకు రాగానే మృతుడు జటోత్ నెహ్రూ తన వైపు ఉన్న లారీ డోర్ ను తీసేందుకు ప్రయత్నించగా ప్రమాదశాత్తు కింద పడగా లారీ టైర్లు తల మీద నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి జటోత్ హ్యన్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags:    

Similar News