Suicide: సిద్ధిపేట జిల్లాలో పట్టపగలే దారుణం.. కత్తితో గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం

ఓ వ్యక్తి గొంతులో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల శివారులో చోటుచేసుకుంది.

Update: 2024-08-30 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి గొంతులో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల శివారులో చోటుచేసుకుంది. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని మాదాపూరానికి చెందిన ఎరుకుల రాజయ్య గౌడ్ (60) శుక్రవారం ఉదయం గొంతులో కత్తితో పొడుచుకుని ప్రాణాలు వదిలేందుకు సిద్ధపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్‌‌కు చేరుకున్నారు. అనంతరం రాజయ్య గౌడ్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కుకునూరుపల్లి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే, రాజయ్య ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.  


Similar News