మామ పై కత్తితో అల్లుడు దాడి..

కట్నం డబ్బులు ఇవ్వాలంటూ మామ పై అల్లుడు కత్తితో దాడి చేశాడు.

Update: 2024-09-03 16:53 GMT

దిశ, కీసర : కట్నం డబ్బులు ఇవ్వాలంటూ మామ పై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నాగారం మున్సిపాలిటీలోని రామలింగేశ్వరకాలనీలో అశోక్ కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అశోక్ అల్లుడైన పత్తి యాదగిరి (24) మామ అశోక్ ఇంటికి మద్యం మత్తులో సోమవారం రాత్రి వచ్చాడు. కట్నం డబ్బులు ఇవ్వాలని అడుగుతూ మామ అశోక్ తో గొడవపడి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో అశోక్ కడుపులో పొడిచాడు. వెంటనే అశోక్ ను హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పత్తి యాదగిరి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాదగిరి పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Similar News