రాష్ట్రంలో మరో దారుణం..తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది.

Update: 2024-08-24 06:05 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తిరుపతిలోని జువైనల్ హోమ్‌లో ఉంటుంది. నేర చరిత్ర కలిగిన బాలికలతో పాటు అనాథ బాలికలు ఈ జువైనల్ హోమ్ లో ఉంటున్నారు. ఈ గృహంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్‌లో సదరు బాలిక 9వ తరగతి చదువుతోంది. హాస్టల్‌కు సరుకులు సరఫరా చేసే నిందితుడు రుషి ఆమెతో పరిచయం ఏర్పరచుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఘటనపై వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారమే జరిగిన గోప్యంగా ఉంచడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News