ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో 50 మంది ప్రయాణికులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం హాజీపూర్‌ శివారులో అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు చెట్టును బలంగా ఢీకొట్టింది.

Update: 2024-08-26 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం హాజీపూర్‌ శివారులో అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News