Road Accident: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-08-28 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని శ్రీనగర్ గజానంద్ రైస్‌ మిల్లు వద్ద గత రెండు రోజులుగా రోడ్డు పక్కన లారీ దిగబడింది. ఈ క్రమంలోనే కారులో అటుగా వెళ్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్‌కు చేరకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Similar News