హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ప్రయాణికులు మృతి
హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్పై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్సింగ్ వద్ద
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్పై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్సింగ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సు బోల్తా పడటంతో ఓఆర్ఆర్పై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.