రైలు కింద పడి రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య..

ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్ పై తల మొండెం వేరువేరుగా పడి ఉన్నాయి.

Update: 2024-09-08 10:24 GMT

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్ పై తల మొండెం వేరువేరుగా పడి ఉన్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజుగా గుర్తించారు. అంబర్పేట్ లో నివాసం ఉంటున్న మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News