పేకాట స్థావరాలపై పోలీసుల దాడి..నలుగురి అరెస్ట్
పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.
దిశ,నేలకొండపల్లి:పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. మండలంలోని చెరువు మాదారం గ్రామంలో నలుగురితో పాటు రూ.7,290 నగదు,మూడు సెల్ఫోన్లు,ల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువు మాదారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నలుగురు యువకులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశారు.