పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. భారీ మొత్తంలో నగదు స్వాధీనం..

పేకాట స్థావరం పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 13 మందితో పాటు రూ.4 లక్షల 37 వేల నగదు,15 సెల్ ఫోన్లు, 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-09-11 12:36 GMT

దిశ, శామీర్ పేట : పేకాట స్థావరం పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 13 మందితో పాటు రూ.4 లక్షల 37 వేల నగదు,15 సెల్ ఫోన్లు, 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన 13 మంది వినాయక నిమజ్జనాల కోసం శామీర్ పేట పెద్ద చెరువు వద్దకు వచ్చారు.

నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత వీరిలో ఒకరి జన్మదిన వేడుకల్లో భాగంగా మూడు చింతలపల్లి మండలం ఉషార్ పల్లి గ్రామ పరిధిలోని ఒక ఫామ్ హౌస్ ను తీసుకున్నారు. జన్మదిన వేడుకల పేరుతో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో ఎస్ఓటీ శామీర్ పేట పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదమూడు మందితో పాటు రూ. 4 లక్షల 37 వేల నగదు, 13 సెల్ ఫోన్లు , నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News