Current Shock: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి..

విద్యుత్ షాక్ తగిలి లైన్ మెన్ మృతి చెందిన ఘటన

Update: 2024-07-22 08:53 GMT

దిశ,అల్లాదుర్గం : విద్యుత్ షాక్ తగిలి లైన్ మెన్ మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలం లో చోటుచేసుకుంది. అల్లాదుర్గం మెట్టుగడ్డ చౌరస్తాలో 161 వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేసే క్రమంలో లైన్మెన్ గణేష్ (24) కి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అల్లాదుర్గం గ్రామానికి చెందిన తమన్న గారి సాయిలు యాదమ్మకు ఒక కొడుకు, కూతురు. గణేష్ కి 8 నెలల నుండి లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇతను రెడ్డిపల్లి, వెంకట్రావుపేట్ గ్రామాలకు లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు.సోమవారం ఉదయం అల్లాదుర్గం మెట్టుగడ్డ చౌరస్తా సమీపంలో 161 వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు అల్లాదుర్గం లైన్మెన్ రామకృష్ణ, గణేష్ ఇద్దరు మరమ్మత్తులు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న గణేష్ ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీరు ఎల్సీ తీసుకోకుండానే విద్యుత్ మరమ్మత్తులు చేపట్టడానికి వెళ్లారంటూ విద్యుత్ అధికారులు తెలిపారు.


Similar News