కారును ఢీకొన్న కరీంనగర్ డైరీ పాల ట్యాంకర్..

కరీంనగర్ డైరీ మిల్క్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ కారును ఢీకొన్న ఘటన కరీంనగర్ పద్మనగర్ బైపాస్ లో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-09-06 06:31 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ డైరీ మిల్క్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ కారును ఢీకొన్న ఘటన కరీంనగర్ పద్మనగర్ బైపాస్ లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రమోద్ సప్తగిరి కాలనీలో తమ బంధువులను ఎక్కించుకొని ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఉజ్వల పార్క్ దగ్గర కరీంనగర్ డైరీ మిల్క్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ కారును వెనకాల నుండి ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. కార్లో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాలను రోడ్డు మీద నుంచి తొలగించారు.


Similar News