దారుణం..అనుమానంతో భార్యను చంపిన భర్త

అనుమానం పెనుభూతమైనది. చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను అంతమొందించాడు.

Update: 2024-09-06 11:49 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:అనుమానం పెనుభూతమైనది. చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను అంతమొందించాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం మంగళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే గత 15 సంవత్సరాలుగా మంగళంలో రూప,రమేష్ దంపతులు కాపురం ఉంటున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమేష్ మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు రమేష్, తరచు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నిద్రలో ఉన్న భార్యను రమేష్ అతి దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం నేరుగా అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తానే తన భార్యను చంపేస్తానని పోలీసులకు తెలియజేశారు.షాక్ కు గురైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.హత్య జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని తెలుసుకొని పోలీసులు నిందితున్ని తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News