పోలీసులను చూసి పారిపోతుండగా అరెస్ట్​

ఉమ్మడి తూప్రాన్, మనోహరబాద్,మేడ్చల్ లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు.

Update: 2024-08-24 15:19 GMT

దిశ, తూప్రాన్ : ఉమ్మడి తూప్రాన్, మనోహరబాద్,మేడ్చల్ లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీల్లో భాగంగా శనివారం తూప్రాన్ పట్టణంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించారు. దాంతో తూప్రాన్ మండల పరిధిలోని నాగులపల్లి, మనోహరాబాద్ మండల పరిధిలోని జీడిపల్లి, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలకు పాల్పడినట్టు నిందితులు నేరం ఒప్పుకున్నారు.

     నిందితుల నుండి ఒక ఇనుప రాడ్, 20 వేల రూపాయల నగదు, ఆరున్నర తులాల బంగారం, 43 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు హవేలీ ఘనపూర్ మండలం ముత్తిపల్లి కి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి, చలిపేట్ భూపతిపూర్ కి చెందిన మరాఠీ ప్రశాంత్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు. సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివనాథం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News