విద్యుత్ షాక్ తో రైతు మృతి

విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బండ పోసానిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది.

Update: 2024-06-18 12:35 GMT

దిశ, వెల్దుర్తి : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని బండ పోసానిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ (36) గ్రామానికి చెందిన గోగుల జైపాల్ వ్యవసాయ భూమిలో బోరు పైపులు మోటారు దించేందుకు కూలి పనికి వెళ్లారు. ఈ క్రమంలో బోరు మోటార్ ను నడిపేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేశాడు.

అనంతరం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తున్న సమయంలో స్తంభం పై నుండి వెళ్లిన మెయిన్ విద్యుత్ వైరు ప్రభాకర్ తలకుతగలడంతో విద్యుత్ షాక్ కుగురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య శ్యామల కుమారుడు రామ్ చరణ్, కూతురు సువార్తలు ఉన్నారు. కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వెల్దుర్తి ఎస్ఐ నవత గౌడ్ తెలిపారు.


Similar News