ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం

ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-07-05 11:27 GMT

దిశ, నిజాంపేట : ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో గల సిద్దిపేట చౌరస్తా వద్ద గల ఇండియా వన్ ఏటీఎం ను అదే విధంగా బస్టాండ్ కు సమీపం లో ఉండే ఏటీఎంలో దుండగులు దొంగతనికి యత్నించారు. ఏటీఎం సరిగ్గా తెరుచుకోకపోవడంతో మిషన్ ను ధ్వంసం చేశారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు. 


Similar News