హైదరాబాద్‌లో మరో దారుణం.. వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన దుండగులు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస హత్య ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఓ

Update: 2024-06-14 05:16 GMT

దిశ, వెబ్‌డె‌స్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస హత్య ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితులు పారిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని బాబా నగర్‌కు చెందిన సయ్యద్ సమీర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, సమీర్ డెకరేషన్ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గంజాయ్ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిందా..? లేదా ఈ పని గంజాయ్ బ్యాచ్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News