విద్యుత్ స్తంభానికి కరెంటు...తాకిన మహిళ మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లోని మొక్కజొన్న ఫ్యాక్టరీ లో విద్యుత్ షాక్ కు గురై ఓ మహిళ మృతి చెందింది.

Update: 2024-09-08 12:30 GMT

దిశ,సత్తుపల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లోని మొక్కజొన్న ఫ్యాక్టరీ లో విద్యుత్ షాక్ కు గురై ఓ మహిళ మృతి చెందింది. బయన్నగూడెం గ్రామానికి చెందిన కోటగిరి సత్యనారాయణ, సత్యవతి  దంపతులు లంకాసాగర్ లోని మొక్కజొన్న ఫ్యాక్టరీ లో వాచ్ మెన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న షెడ్డులో వంట చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై సత్యవతి అక్కడికక్కడే మృతి చెందింది.

    వంట చేసే క్రమంలో సత్యవతి పక్కనే ఉన్న ఇనుప స్తంభాన్ని పట్టుకోగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. అయితే గతం లో కూడా వంట షెడ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పినా ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని, దీని కారణంగానే సత్యవతి షాక్ కు గురై మృతి చెందింది అని బంధువులు తెలుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News