సెటిల్‌మెంట్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు !

by  |
సెటిల్‌మెంట్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు !
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌ కేసులో పిటిషనర్‌ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. అయితే సెటిల్‌మెంట్‌కు రావాలని పలువురు అధికార పార్టీ నేతలు తమపై ఒత్తిడి చేస్తున్నారని, పల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని రామయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనచరులు వైట్ లైమ్‌స్టోన్ మైనింగ్‌కు పాల్పడుతున్నారని దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించి పూర్తి వివరాలు ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే.


Next Story