ఆదిలాబాద్‌లో సాయంత్రం ఐదు వరకే

by  |
ఆదిలాబాద్‌లో సాయంత్రం ఐదు వరకే
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు ఏడుగురికి కరోనా సోకడంతో పట్టణంలో కలకలం రేగింది. దీంతో ఆదివారం నుంచి దుకాణాల పని వేళలు కుదించనున్నట్లు వ్యాపారస్తులు వెల్లడించారు. ఇకపై పట్టణంలో దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.


Next Story

Most Viewed