న్యాయం జరిగేవరకూ పోరాడుతాం..

by  |
న్యాయం జరిగేవరకూ పోరాడుతాం..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: 30 సంవత్సరాలుగా గొల్లపాడు కాల్వపై నివాసం ఉంటున్న ప్రజలకు ప్ర‌భుత్వం ప‌ట్టాలతో పాటు, ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని అఖిల‌ప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేశారు. బుధ‌వారం సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్‌, టీజేఎస్, టీడీపీ, యువ తెలంగాణ త‌దిత‌ర‌ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్‌లోని 41,42,43,44,45 డివిజన్లు సుందరయ్య నగర్, పంపింగ్ వేల్ గొల్లపాడు కాలువ ప్రాంతం నిర్వాసితులతో సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బాధితుల‌కు రాజ‌కీయ పార్టీల‌న్నీ అండ‌గా ఉంటాయ‌ని భ‌రోసానిచ్చారు. న్యాయం జ‌రిగేవ‌ర‌కూ పోరాటం సాగిస్తామ‌ని స్పష్టం చేశారు.


Next Story