నిర్మల వ్యాఖ్యలకు అజయ్ కల్లం కౌంటర్

by  |
నిర్మల వ్యాఖ్యలకు అజయ్ కల్లం కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం స్పందించారు. రాష్ట్రంలో అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేశామన్నారు. అర్బన్ హౌసింగ్‌లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.400కోట్లు ఆదా అయినట్లు తెలిపారు. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కల్లం స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం బీజేపీ వర్చువల్ ర్యాలీలో నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ… ఏపీలో కులం, అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలుతున్నాయని విమర్శలు గుపించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed