ఏలూరులో టెన్షన్.. నేడు శాంపిల్స్ ఫలితాలు

by srinivas |
ఏలూరులో టెన్షన్.. నేడు శాంపిల్స్ ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ఏలూరు నగరంతో పాటుగా సమీపంలోని కొన్ని గ్రామాలను కలవరపరుస్తున్న అంతుచిక్కని వ్యాధిపై అన్వేషణ వేగవంతమయ్యింది. పలు సందేహాలు, అనేక అనుమానాల మధ్య ఉన్నత స్థాయి వైద్యాధికారుల బృందాలు పరిశీలన ఉధృతమయ్యింది. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌కి పంపించిన శాంపిళ్ల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ శాంపిల్స్ ఫలితాలను ఎయిమ్స్ వైద్యులు వెల్లడించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ వైరస్ బారినపడిన బాధితుల సంఖ్య 591కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 46కు చేరింది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటివకూ డిశ్చార్జి అయినవారి సంఖ్య 511 పెరిగింది.



Next Story

Most Viewed