- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంటికి వస్తూ 9 మంది మృత్యు ఒడిలోకి..

X
దిశ, ఏపీ బ్యూరో: లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో వారంతా మిరప కోత పనికి వెళ్లారు. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆనందంతో పొలంలో గడిపారు. తీరా ఇంటికి వచ్చే సమయంలో విద్యుత్ స్తంభం రూపంలో వారిని మృత్యువు కబళించింది. వివరాలు.. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న కూలీల ట్రాక్టర్ మార్గమధ్యలో విద్యుత్ స్తంభాన్నిఢీకొట్టింది. దీంతో కరెంట్ తీగలు కూలీల మీద తెగి పడటంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం రాపర్లలో చోటుచేసుకుంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో దాదాపు 15 మంది ఉన్నట్లు సమాచారం.
Next Story