- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని కొందరు దుండగులు ఫోర్జరీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాకేష్ తెలిపారు. అదనపు కలెక్టర్ రాజా విక్రమ్ రెడ్డి వద్ద పని చేసే డ్రైవర్ రాజశేఖర్, ప్రయివేటు అసిస్టెంట్లు శివ, గిరిధర్ కొద్ది రోజులుగా డీజిల్ ఓచర్లు సొంతగా రాసుకుని అదనపు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. డీజిల్ వాహనంలో పోయించకుండా బయట విక్రయించే వారు. ఇప్పటివరకూ సుమారు రూ.1.62 లక్షల విలువైన డీజిల్ను విక్రయించారు. దీంతో అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టడంతో డ్రైవర్ రాజశేఖర్, అసిస్టెంట్లు శివ, గిరిధర్ కలసి డీజిల్ ఓచర్లపై అదనపు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డీజిల్ విక్రయించుకున్నట్టు నిర్దారణ అయ్యిందని ఎస్సై రాకేష్ తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై ఫోర్టరీ చీటింగ్ కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.