- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చివరిసారిగా బాలునుయ ఆగస్టు 3వ తేదీని కలిసి, మాట్లాడానని తెలిపారు. కరోనా బారిన పడి బాలు ఆస్పత్రిలో చేరాక చరణ్, శుభలేక సుధాకర్తో టచ్లో ఉన్నాం అన్నారు.
మిథునం సినిమా అనుకున్నప్పటి నుంచి నా మదిలో బాలునే ఉన్నారు అని వెల్లడించారు. మిథునం కథానాయకుడిలా వాస్తవానికి బాలు భోజనప్రియుడు కాదు అని స్పష్టం చేశారు. సాహిత్యాభిలాషతోనే తెలుగు భాషపై బాలుకు అంత పట్టు ఉందని తెలిపారు. పద ప్రయోగాలతో బాలసుబ్రహ్మణ్యం పరవశించిపోతారని అన్నారు. నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో రకాల పాత్రలు చేసి, న్యాయం చేశారని తెలిపారు.
Next Story