- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి..
by Shyam |

X
దిశ, ఆత్మకూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ నాగ మద్దిలేటి పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని టీయుడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎస్సై రాఘవేంద్ర కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు మహిపాల్, తిరుమలేష్, జిందే మురళి, వెంకటేష్, సతీష్, నరేందర్, అనిల్, తిరుపతయ్య, శ్రీను, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story