- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఇటీవలే జరిగిన పైల్ ఆపరేషన్ గాయానికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు. గాయం, బీపీ మినహా ఆయనకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. పచ్చిగా మారిన గాయం ఆయనను మరింత ఇబ్బంది పెడితే మరోసారి ఆపరేషన్ చేసేందుకు వెనుకాడమని చెప్పారు. మూడు రోజుల్లో ఆ గాయం తగ్గే అవకాశముందని వెల్లడించారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని వివరించారు.
కాగా, అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తరలించే క్రమంలో 20 గంటల పాటు వాహనంలో కూర్చోబెట్టారు.
Next Story