కీసర ఎమ్మార్వో కేసులో ఉన్నతాధికారుల పాత్ర!

by  |
కీసర ఎమ్మార్వో కేసులో ఉన్నతాధికారుల పాత్ర!
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లాలోని కీసర ఎమ్మార్వో కేసును దర్యాప్తు ఏసీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను 4 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

అదేవిధంగా ఈ కేసులో సంబంధమున్న ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శ్రీనాథ్, అంజిరెడ్డి ఇంట్లో దొరికిన ప్రజాప్రతినిధుల డాక్యుమెంట్లను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. తహశీల్దార్ నాగరాజు బ్యాంకు లాకర్లను ఏసీబీ ఇవాల ఓపెన్ చేయనున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed