నదిలో దూకి మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
నదిలో దూకి మహిళ ఆత్మహత్య
X

దిశ, జగిత్యాల: అనారోగ్య సమస్యల కారణంగా ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం… ధర్మపురి పట్టణానికి చెందిన గడిపెల్లి భారతి అలియాస్ బిందు(42) గతకొంత కాలంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది.

ఈ క్రమంలో గురువారం రాయపట్నం గోదావరి నది వద్ద, వంతెన పైనుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన జాలర్లు రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే మహిళ గల్లంతైంది. విషయం తెలుసుకున్న ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతురాలికి భర్త, ఒక కూతురు ఉన్నారు. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed