- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గ్రామమైన మల్లానూరు పంచాయతీలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో వేరుశనగపంటకు రాత్రి వేళలో కాపలాగా ఉన్న తండ్రీకూతుర్లపై ఏనుగు దాడి చేసింది. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సోనియాపై ఏనుగు దాడి చేసింది. తొండంతో సోనియాను విసిరి కొట్టడంతో… ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమె తండ్రి మురుగన్ ఏనుగు దాడి నుండి తప్పించుకున్నాడు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. కాగా మరణించిన సోనియా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోనియా మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న చిత్తూరు డిఎఫ్ఓ శంకర్ ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Next Story