అప్పులు తీర్చలేక ఆత్మహత్య..!

by  |
అప్పులు తీర్చలేక ఆత్మహత్య..!
X

దిశ, పటాన్‌చెరు: మద్యానికి బానిసై చేసిన అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‎స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం ఆరోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భిక్షపతి.. నాలుగేళ్ల నుంచి ముత్తంగిలోని నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో భిక్షపతి మద్యానికి బానిసై, ఇతర అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక గురువారం రాత్రి తన ఇంట్లో సీలింగ్ రాడ్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని గమనించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామానాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed