- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: మద్యానికి బానిసై చేసిన అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం ఆరోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భిక్షపతి.. నాలుగేళ్ల నుంచి ముత్తంగిలోని నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో భిక్షపతి మద్యానికి బానిసై, ఇతర అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక గురువారం రాత్రి తన ఇంట్లో సీలింగ్ రాడ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని గమనించి మృతుడి భార్యకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామానాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story