ఫుల్లుగా తాగించి.. బావిలో పడేసి

by  |
ఫుల్లుగా తాగించి.. బావిలో పడేసి
X

దిశ, కరీంనగర్: ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వీరికి ఓ పాప కూడ పుట్టింది. అయితే ఇష్టం లేకున్నా తమ ఇంటి ఆడపడుచును పెళ్లి చేసుకున్నాడన్న కోపం మాత్రం తగ్గలేదు అమ్మాయి పుట్టింటివారికి. తొలి ఏకాదశి పండగ నాడు బావకు మద్యం తాగించి హత్య చేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్టేషన్ పరిధిలోని నాగరాజు అనే కూలీ అదే గ్రామానికి చెందిన శిరీషను ప్రేమించాడు. పెళ్లికి మొదట శిరీష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఓకే కులానికి చెందిన వారేకావడంతో ఆ తర్వాత సమ్మతించి పెళ్ళి చేశారు. పెళ్లై ఏడాది గడిచినా శిరీష పుట్టినింటి వారిలో మాత్రం కోపం తగ్గలేదు. తొలి ఏకాదశి రోజునా విందు కోసమని నాగరాజును పిలిపించి మద్యం పుల్లుగా తాగించి హత్య చేసి బావిలో పడేశారు బావమరిది. మృతుడు నాగరాజు భార్య 18 రోజుల కిత్రం పాపకు జన్మిచింది. ఈ కేసులో నాగరాజు బావమరిది నిమ్మల అనిల్, మామ రాజయ్యను అరెస్ట్ చేశామని సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.



Next Story