ఉగ్రరూపం దాల్చిన ప్రాణహిత

by  |
ఉగ్రరూపం దాల్చిన ప్రాణహిత
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. పెన్ గంగాలోని డ్యాం గేట్లు తెరవడంతో వరద ప్రవాహం మూడు రోజులుగా సాగుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 80 గేట్లకు గాను 75 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద 12.27 మీటర్ల మేర నీరు వచ్చి చేరింది. మరో మీటరు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ వద్ద ఇన్ ఫ్లోగా 9.60 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా మొత్తం నీటిని దిగువకు పంపిస్తున్నారు.


Next Story

Most Viewed