మాస్క్ పెట్టుకోకపోతే రూ.250 జరిమానా.. ఎక్కడో తెలుసా?

by vinod kumar |   ( Updated:2021-03-24 23:25:57.0  )
మాస్క్ పెట్టుకోకపోతే  రూ.250 జరిమానా.. ఎక్కడో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వాలు ఎంత నియంత్రించాలని ప్రయత్నిస్తున్న అంతకంతకు వైరస్ పెరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలను అమలులోకి తీసుకువచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం చెప్తున్నా ప్రజలు వినడం లేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పక ధరించాలని ఆదేశాలు జారీచేశాయి. అంతేకాదు ఒక వేళ మాస్క్ పెట్టుకోకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుతం బెంగుళూరులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన బెంగళూరు మహానగర పాలిక సంస్థ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించిన వారికి రూ.250 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే వేడుకలు, సంబరాలపై కొన్ని నిర్దిష ఆదేశాలను జారీచేసింది.

Advertisement

Next Story

Most Viewed