Today Weather Update (20-02-2025) : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత

by Prasanna |
Today Weather Update (20-02-2025) : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. చలి పోయిందనుకుంటే ఇప్పుడు భానుడు రెడీ అవుతున్నాడు తన ప్రతాపం చూపించడానికి. రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ సంచాలకులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు ఏపీ , తెలంగాణలో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. 29 డిగ్రీల సెల్సియస్ ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. 28 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. 29 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. 28 డిగ్రీల సెల్సియస్ ఉంది.


Advertisement
Next Story

Most Viewed