కాంగ్రెస్‌కు శ్యామ్ పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన ఖర్గే

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌కు శ్యామ్ పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు అనూహ్య షాక్ తగిలింది. కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. వెంటనే మల్లిఖార్జున ఖర్గే కూడా పిట్రోడా రాజీనామాను ఆమోదించారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ‘‘భారతదేశంలో తూర్పున వుండే ప్రజలు చేనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో వుండేవారు అరబ్బుల్లా, ఉత్తరాదిన వుండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు నల్లగా ఆఫ్రికన్స్‌లా వుంటారు’’ అంటూ శ్యామ్ పిట్రోడా కామెంట్స్ చేశారు. 70 ఏళ్లుగా మన భారతదేశ గుర్తింపు ఇదే అనేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో రాజీనామా చేసినట్లు సమాచారం.

Next Story